995 కేజీల కిచిడితో వరల్డ్ రికార్డ్
సిమ్లా, జనవరి 16
సంక్రాంతి నేపథ్యంలో హిమాచల్ప్రదేశ్లో 1995 కిలోల కిచిడీని తయారు చేశారు. ఇప్పటివరకు దేశంలో ఒకేసారి ఇంత భారీగా కిచిడీ వండలేదు. దీంతో ఈ కిచిడీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకుంది. సిమ్లాకు 55 కిలోమీటర్ల దూరంలోని తట్టపాణి గ్రామంలో ఈ కిచిడీని వండారు.ఈ గ్రామంలోని సట్లెజ్ నదీ తీరం వద్దకు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు ఏటా అన్నదానం చేస్తారు. ఈ నేపథ్యంలో 1995 కేజీల కిచిడీని ఒకే పాత్రలో వండి గిన్నిస్ రికార్డ్స్ సాధించారు. 25 మంది వంటగాళ్లు ఐదు గంటలపాటు శ్రమించి ఈ కిచిడీ తయారు చేశారు. 450 కిలోల బియ్యం, 190 కిలోల ధాన్యాలు, 1,100 లీటర్ల నీరు, 90 కిలోల నెయ్యి, 55 కిలోల సుగంధ ద్రవ్యాలతో దీన్ని వండారు. దీంతో గతేడాది ప్రముఖ చెఫ్ సంజీవ్ కపూర్ తయారు చేసిన 918.8 కేజీల కిచిడీ రికార్డ్ బద్దలైంది.