YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రాజధాని అంశంపై జగన్ సర్కార్ దూకుడు

రాజధాని అంశంపై జగన్ సర్కార్ దూకుడు

రాజధాని అంశంపై జగన్ సర్కార్ దూకుడు
విజయవాడ జనవరి 16 br /> రాజధాని అంశంపై జగన్ సర్కార్ దూకుడు పెంచింది. ఇప్పటికే హైపవర్ కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. తాజాగా అమరావతి రైతుల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తోంది. ఈ నెల 17 సాయంత్రం 5 గంటలలోపు తమ అభ్యంతరాలు, అభిప్రాయాలను తెలియజేయొచ్చు. మెయిల్, ఆన్‌లైన్, నేరుగా సీఆర్డీఏ కార్యాలయంలో సూచనలు, సలహాలు, అభ్యంతరాలను తెలపొచ్చు. తుళ్లూరులోని సీఆర్డీఏ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు.మెయిల్ ద్వారా అభిప్రాయాలు చెప్పాలనుకుంటే.. commissioner@crda.org మెయిల్ చేయాలి. ఒకవేళ ఆన్‌లైన్ ద్వారా తెలియజేయాలనుకుంటే.. https://crda.ap.gov.in ద్వారా చెప్పొచ్చు. నేరుగా సీఆర్డీఏ కార్యాలయానికి వెళ్లి అందజేయొచ్చు. రాజధాని రైతులతో పాటూ సాధారణ ప్రజలు కూడా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.రైతులు తమ అభ్యంతరాలను తెలియజేయవచ్చని హైపవర్ కమిటీలో ఉన్న మంత్రులు తెలియజేశారు. ఈ నెల 17 సాయంత్రం వరకు గడువు ఇచ్చారు. 29 గ్రామాల రైతులు, ప్రజలు సీఆర్డీఏ కమిషనర్‌కు మెయిల్, రాత పూర్వకంగా తమ సూచనలు, సలహాలు, అభ్యంతరం కూడా చెప్పొచ్చు. కాబట్టి ఎవరైనా రాజధానిపై తమ అభిప్రాయాలను పై పద్దతుల్లో తెలియజేయొచ్చు.

Related Posts