రాజధాని అంశంపై జగన్ సర్కార్ దూకుడు
విజయవాడ జనవరి 16 br /> రాజధాని అంశంపై జగన్ సర్కార్ దూకుడు పెంచింది. ఇప్పటికే హైపవర్ కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. తాజాగా అమరావతి రైతుల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తోంది. ఈ నెల 17 సాయంత్రం 5 గంటలలోపు తమ అభ్యంతరాలు, అభిప్రాయాలను తెలియజేయొచ్చు. మెయిల్, ఆన్లైన్, నేరుగా సీఆర్డీఏ కార్యాలయంలో సూచనలు, సలహాలు, అభ్యంతరాలను తెలపొచ్చు. తుళ్లూరులోని సీఆర్డీఏ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు.మెయిల్ ద్వారా అభిప్రాయాలు చెప్పాలనుకుంటే.. commissioner@crda.org మెయిల్ చేయాలి. ఒకవేళ ఆన్లైన్ ద్వారా తెలియజేయాలనుకుంటే.. https://crda.ap.gov.in ద్వారా చెప్పొచ్చు. నేరుగా సీఆర్డీఏ కార్యాలయానికి వెళ్లి అందజేయొచ్చు. రాజధాని రైతులతో పాటూ సాధారణ ప్రజలు కూడా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.రైతులు తమ అభ్యంతరాలను తెలియజేయవచ్చని హైపవర్ కమిటీలో ఉన్న మంత్రులు తెలియజేశారు. ఈ నెల 17 సాయంత్రం వరకు గడువు ఇచ్చారు. 29 గ్రామాల రైతులు, ప్రజలు సీఆర్డీఏ కమిషనర్కు మెయిల్, రాత పూర్వకంగా తమ సూచనలు, సలహాలు, అభ్యంతరం కూడా చెప్పొచ్చు. కాబట్టి ఎవరైనా రాజధానిపై తమ అభిప్రాయాలను పై పద్దతుల్లో తెలియజేయొచ్చు.