టీఆర్ఎస్ గెలుపు ఖాయం
హుజూర్ నగర్ జనవరి 16
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పలు వార్డుల్లో వార్డు సభ్యుల తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ హుజూర్ నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీలో టిఆర్ఎస్ జండా ఎగరడం ఖాయమని అన్నారు. 20సం నుండి వార్డులు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయని.. టిఆర్ఎస్ అభ్యర్థులు గెలిచినట్లయితే చైర్మన్ తో కలిసి పట్టణ అభివృద్ధికి ఒక ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. పట్టణాలు అభివృద్ధి పల్లెల్లో సమగ్ర అభివృద్ధి సీఎం కేసీఆర్ వల్లే సాధ్యం. ఇంటింటి ప్రచారం నిర్వహించడం ప్రతి వార్డు లో టిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులకు ప్రజలు స్వచ్ఛందంగా బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. తనపై నమ్మకంతో ఎలా అయితే ఓట్లు వేసి ఎమ్మెల్యే గా గెలిపించారో.. అదే నమ్మకంతో టిఆర్ఎస్ కౌన్సిలర్ల ను కూడా గెలిపించాలని అన్నారు. అధికార పార్టీ కౌన్సిలర్ గా ఎన్నిక అయితే వార్డు అభివృద్ధి కూడా సమగ్ర అభివృద్ధి సాధ్యమౌతుంది అని ఓటర్లకు పిలుపునిచ్చారు.... ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు కొమ్ము శ్రీను, జక్కుల శంభయ్యా, కోతి సంపత్ రెడ్డి, ఓరుగంటి నాగేశ్వరరావు, దొంగరి మంగమ్మ, పిట్టల అరవింద్, చిట్యాల ధనలక్ష్మి, మరియు టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు