త్వరలో భారతీ సీఎం కావచ్చు జేసీ సంచలన వ్యాఖ్యలు
అమరావతి జనవరి 16
సీఎం అవుతూనే రాజధానినే మార్చాలని అనుకున్నారు జగన్. కృష్ణా-గోదావరి నదుల వల్లే ఈ ప్రాంతంలో డబ్బు ఎక్కువగా ఉంది. మెజార్టీ భూములు కొని ఉండొచ్చేమో కానీ.. కమ్మ వాళ్లు మాత్రమే భూములు కొనలేదు. గత ఏడు నెలల కాలంగా విజయ సాయి ఢిల్లీ-విశాఖ మధ్య తిరిగారు. డబ్బులున్న వాళ్లొచ్చి భూములు కొంటే.. రైతులకేం నష్టమని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఒకే ఒక్క డీల్లో జగనుకు వేయి కోట్లు వచ్చాయని చెబుతున్నారు. గత ఎన్నికల్లో కేసీఆర్ చేసిన ఆర్ధిక సాయాన్ని జగన్ ఎప్పుడో చెల్లించేశారు. కేసీఆర్ విషయంలో జగన్ గురు భక్తి చాటుకున్నారు. మూడు రాజధానులు చేసేయ్ అని కేసీఆర్ జగనుకు చెప్పారట. ఏపీలోని పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలి వెళ్లిపోయాయి. ఏపీపై నమ్మకం.. విశ్వాసం పోయింది.. అందుకే పరిశ్రమలు పోయాయి. ఓ ఏడాది.ఏడాదిన్నరలో భారతి ముఖ్యమంత్రి కావచ్చని అయన వ్యాఖ్యానించారు. జగన్ నమ్మకాన్ని కొల్పోయాడు. కుల ద్వేషం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని జేసీ అన్నారు.