గుదిబండగా మారిని జగన్
విజయవాడ జనవరి 16
రాష్ట్రానికి సీఎం జగన్ గుదిబండలా తయారయ్యారని సీపీఐ నేత రామకృష్ణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ మాట తప్పను-మడమ తిప్పను అని..మనిషి మొత్తం తిరిగిపోయారని వ్యాఖ్యానించారు. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగితే ప్రభుత్వం 7 నెలల నుంచి గాడిదలు కాస్తోందా? అని ఆయన దుయ్యబట్టారు. రాజధాని శ్మశానం అయితే.. ఇంత మంది పోలీసులు ఎందుకని ప్రశ్నించారు. బొత్స ఎదో ఒక రోజు శ్మశానానికి వెళ్లాల్సిందే రామకృష్ణ అన్నారు. సీఎం బతుకు బస్టాండ్ అయిందని, అందుకే హైపవర్ కమిటీ భేటీ బస్టాండ్లో పెట్టుకున్నారని వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు తింగరి సీఎంలు 6 గంటల పాటు ఏం మాట్లాడుకున్నారో అని అన్నారు. అమరావతి జోలికి వస్తే జగన్ రాజకీయ పతనం ప్రారంభమవుతుందని హెచ్చరించారు. ఈ నెల 20న అసెంబ్లీని ముట్టడించనున్నట్లు రామకృష్ణ తెలిపారు.