కోడి పందాల కోసం ఏపీలో తిరుగుతున్న తెలంగాణ మంత్రులు
టీటీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి
హైదరాబాద్ జనవరి 16
: మంత్రులకు తెలంగాణలో పని లేదని, అందుకే కోడి పందాల కోసం ఏపీలో తిరుగుతున్నారని టీటీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్టాడుతూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు రాజకీయ జన్మనిచ్చిన పార్టీకి..రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా? అంటూ మండిపడ్డారు. ఏపీలో ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. తెలంగాణ మంత్రులు వెళ్లి పుండు మీద కారం చల్లుతున్నారని, మంత్రి తలసాని సభ్యతగా వ్యవహరిస్తే బాగుంటుందని ఆయన సూచించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని రావుల స్పష్టం చేశారు.