ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా శైలజానాథ్
అమరావతిజనవరి 16
ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా శైలజానాథ్ నియామకం అయ్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తులసిరెడ్డి, షేక్ మస్తాన్వలీని నియమించింది. ఈ మేరకు వాళ్లు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇంతకాలం ఏపీ పీసీసీ చీఫ్గా రఘువీరారెడ్డి ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీని సీనియర్ నేతలంతా వీడినా.. రఘువీరా మాత్రం హస్తం పార్టీలోనే కొనసాగారు. 2014, 2019 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒంటరిగా పోటీ చేసి ఒక్క ఎమ్మెల్యే సీటును కూడా గెలవలేదు.