బీజేపీకి ఓటేస్తే వృధా అవుతుంది టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అభివృద్ధి అవుతుంది
టిఆర్ఎస్ రెబల్ అభ్యర్థులకు ఓటు వేయవద్దు
- ఆర్థిక మంత్రి హరీష్ రావు
మెదక్ జనవరి 17,
మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ అన్ని పార్టీల ఆఫీస్ లు ఢిల్లీలో ఉంటే మన టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మన నర్సాపూర్ లోని హనుమంత పూర్ లో ఉంది. రాష్ట్రంలో ని అన్ని మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీ లకు ఒక్క సీటు కూడా రాదు. మన వార్డ్ అభివృద్ధి చెందాలంటే, మన అధికార పార్టీకి ఓటు వేయాలని అన్నారు. ప్రతిపక్ష పార్టీలకు ఓటు వేస్తే అభివృద్ధి చెందదని వాళ్లకు వేసిన ఓటు సముద్రంలో కలిసినట్టు అని అన్నారు. కాబట్టి నర్సాపూర్ లోని 15 వార్డులకు 15 కౌన్సిలర్ లను భారీ మెజార్టీతో గెలిపించి, మన నర్సాపూర్ మున్సిపాలిటీని అభివృద్ధికి తోడ్పడాలి అని అన్నారు.