మూడు రాజధానులతో రాష్ట్రం దెబ్బతింటుంది
అనంతపురం జనవరి 17,
రాజధానిగా అమరావతిని కాకుండా పరిపాలన వికేంధ్రీకరణ పేరుతో మూడు రాజధానులు దిశగా జగన్ తీసుకున్న నిర్ణయంపై మాజీ మంత్రి కాల్వశ్రీనివాసులు ఫైర్ అయ్యారు. మూడు రాజధానుల ప్రతిపాదలను అన్నీ రాజకీయ పక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని,ఉద్యమాలు ప్రత్యక్షంగా జరుగుతున్నా దీనిపై జగన్ ఎందుకు ఏకపక్షంగా ముందుకు సాగుతున్నారని ప్రశ్నించారు. టిడిపి,సిపిఐ,జనసేన పోరాటాలు చేస్తోందని,ముఖ్యంగా మహిళలు కూడా ఉద్యమంలో కీలకపాత్రపోషిస్తున్నారని చెప్పారు. మూడు రాజధానుల ఆలోచనల కారణంగా రాష్ట్రం దారుణంగా దెబ్బతింటుందని అన్నారు.