YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులు

ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులు

ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులు
హైదరాబాద్ జనవరి 18,
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ 24వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఆయన ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు నివాళులర్పించారు.  జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, దగ్గుబాటి పురంధేశ్వరి, నందమూరి రామకృష్ణ, సుహాసిని తదితరులు నివాళులర్పించారు. తమ అభిమాన నటుడిని గుర్తు చేసుకుని పెద్ద సంఖ్యలో అభిమానులు. ఘాట్ చుట్టూ ప్రదక్షిణలు చేసి, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.తెదేపా కార్యకర్తలు కూడా భారీగా తరలివచ్చారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు రక్తదాన, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. ఎన్టీఆర్ మనవరాలు టీడీపీ నాయకురాలు సుహాసిని మాట్లాడుతూ ఎన్టీఆర్  ఆశయ సాధనకు నిరంతరం కృషి చేస్తామని అన్నారు. తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు ప్రపంచానికి చాటిన ఘనత ఎన్టీఆర్దేనన్నారు.

Related Posts