YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేసీఆర్ కు గర్వం పెరిగింది

కేసీఆర్ కు గర్వం పెరిగింది

కేసీఆర్ కు గర్వం పెరిగింది
యాదాద్రి జనవరి 18,
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ కేంద్రంలో బిజెపి నేత మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు రోడ్షో నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో జరుగుతున్న అన్యాయాల మీద బిజెపి పోరాడుతుందని నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ  దూసుకెళుతున్నదని అన్నారు అన్ని మున్సిపాలిటీలు బీజేపీ కైవసం చెడుకుంటున్నదని ,కారణం మోడీని ప్రజలు గెలిపించుకోవాలని ప్రజల్లో ఉందన్నారు, కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ అన్నాడు, రైతు రుణమాఫీ అన్నాడు కానీ ఏ ఒక్కరికి మాఫీ అయింది లేదు. నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తానన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇవ్వనేలేదు.  ఆంద్రోల్లు పోతే ఉద్యోగాలు వస్తాయన్నాడు. ఉద్యోగాలు రాలేదు. ఇన్ని అబద్ధాలు ఆడిన కేసీఆర్ కి తగిన గుణపాఠం చెప్పాలి అని అన్నారు.  కేసీఆర్ కుటుంబం కోసమే తెలంగాణ ఏర్పడింది తప్ప ప్రజల కోసం కాదని తెలిపారు. కెసిఆర్ కి గర్వం పెరిగిందని  దేవుడు ఉండాల్సిన గుడిలో తన బొమ్మను వేయించుకున్నాడు అంటే ఎంత గర్వం ఉందో అది పతనానికి నిదర్శనమని అటువంటి వ్యక్తికి భగవంతుని రూపం లో ప్రజలే మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కోరారు మున్సిపల్ ఎన్నికల్లో ఆలేరు బిజెపి కౌన్సిలర్ల అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Related Posts