YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు దేశీయం

అత్యాచారం కేసును ఉప‌సంహ‌రించుకోవాల‌ని తల్లిపై నిందితుల దాడి హాస్ప‌ట‌ల్‌లో చికిత్స పొందుతు మృతి

అత్యాచారం కేసును ఉప‌సంహ‌రించుకోవాల‌ని తల్లిపై నిందితుల దాడి  హాస్ప‌ట‌ల్‌లో చికిత్స పొందుతు మృతి

అత్యాచారం కేసును ఉప‌సంహ‌రించుకోవాల‌ని తల్లిపై నిందితుల దాడి
          హాస్ప‌ట‌ల్‌లో చికిత్స పొందుతు మృతి
లక్నో జనవరి 18
కూతురుపై అత్యాచారం కేసును ఉప‌సంహ‌రించుకోవాల‌ని కోరుతూ  తల్లిని నిందితులు కొట్టడం తో ఆమె మరణించిన ఘటన ఇది.వివరాల్లోకి వెళితే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని కాన్పూర్‌లో రెండేళ్ల క్రితం ఓ మైన‌ర్ అమ్మాయిని అత్యాచారం చేసిన కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురు ఆ అమ్మాయి త‌ల్లిపై ఇటీవ‌ల దాడి చేశారు. ఆ దాడి వల్ల‌ టీనేజ‌ర్ త‌ల్లి తీవ్రంగా గాయ‌ప‌డింది.హాస్ప‌ట‌ల్‌లో చికిత్స పొందుతున్న ఆమె ఇవాళ మృతిచెందింది. లైంగిక వేధింపుల కేసులో ఆరుగుర్ని గ‌తంలో అరెస్టు చేశారు. అందులో న‌లుగురు బెయిల్ తెచ్చుకున్నారు కేసును ఉప‌సంహ‌రించుకోవాల‌ని టీనేజ‌ర్ త‌ల్లిపై వాళ్లు వ‌త్తిడి తెచ్చారు. విన‌క‌పోవ‌డంతో ఆ మ‌హిళ ఇంటికి వెళ్లి దాడి చేశారు. అయితే ఆ దాడిని ఆమె ఇంటిపై నుంచి కొంద‌రు షూట్ చేశారు. మ‌హిళ‌పై దాడి చేసిన కేసులో ముగ్గుర్ని అరెస్టు చేశారు. మ‌రో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Related Posts