అమరావతిపై దమ్ముంటే అసెంబ్లీలో చర్చించండి
- వర్ల రామయ్య
గుంటూరు జనవరి 18
అమరావతిపై ఏ నివేదిక ఇవ్వలేదని ఐఐటీ మద్రాస్ చెప్పిందని టీడీపీ నేత వర్ల రామయ్య స్పష్టం చేశారు. అమరావతి ముంపు ప్రాంతమని ఐఐటీ మద్రాస్ నివేదిక ఇచ్చిందని మంత్రులు చెప్పడం అవాస్తవమని వర్ల రామయ్య అన్నారు. ఇలాంటి రీసెర్చ్ చేసే డిపార్ట్మెంట్ లేదని ఐఐటీ మద్రాస్ చెబుతోందని, బీసీజీ గ్రూప్ అబద్దాల పుట్ట..డబ్బుకు ఆశపడి దొంగ రిపోర్ట్ ఇచ్చిందని వర్ల రామయ్య విమర్శించారు. అమరావతి ముంపు ప్రాంతం కాదని గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పిందని, దమ్ముంటే అసెంబ్లీలో చర్చించండని.. ప్రజల్లోకి రండి అని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.