జనగామలో బీజేపీ ప్రచారం
జనగామ జనవరి 18
జనగామ మున్సిపల్ ఎన్నికల్లో బాగంగా జనగామ పట్టణంలోని పలు వార్డులలో మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహనరావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు,ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి నాయకులు చాడసురేష్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కేవిఎల్ఎన్ రెడ్డి, బీజేపీ అభ్యర్థులు,కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన రావు మాట్లాడుతూ టీఆరెఎస్ ప్రభుత్వం జనగామలో రెండు సార్లు గెలిచిన అభివృద్ది శూన్యమని,జనగామ లోని వార్డులలో ఇంత వరకు తాగునీటిని సరిగా అందించలేదని,దేశం మొత్తం నరేంద్ర మోడీ వైపు చూస్తుందని,జనగామలో అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారని ఒక్క సారి బిజెపి కి అవకాశం ఇస్తే కేంద్ర నిధులతో అభివృద్ది అంటే ఏమిటో చూపిస్తామని,ప్రజలు బిజెపిని ఆదరించి అధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు. 16 వ వార్డు అభ్యర్థి కడమంచి రమేష్ మాట్లాడుతూ వార్డులో నీ ప్రతి సమస్యను తీరుస్తానని,ప్రజల సమస్యల కోసం మున్సపాలిటీల్లో పోరాడుతానని, వార్డు ప్రజలు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అన్నారు.