భారత దేశ స్వాంతంత్ర్యాన్ని, ఐక్యతను, వందేమాతరాన్ని అంగీకరించని వారికి ఈ దేశంలో ఉండే హక్కులేదు
భారత దేశ స్వాంతంత్ర్యాన్ని, ఐక్యతను, వందేమాతరాన్ని అంగీకరించని వారికి ఈ దేశంలో ఉండే హక్కేలేదని కేంద్రమంత్రి ప్రతాప్ చంద్ర సారంగీ వ్యాఖ్యానించారు. జండా పట్టిన ప్రతివాడు దేశభక్తుడు కాలేడు పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్న వారిపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ‘‘దేశానికి నిప్పుపెట్టడానికి సిద్ధంగా ఉన్నవారు ఎప్పటికీ దేశభక్తులు కాలేరు’’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. సీఏఏను తీసుకొచ్చినందుకు ప్రధాని మోదీకి అందరూ కృతజ్ఞతలు తెలపాలని, ఈ చట్టంపై కాంగ్రెస్ లేనిపోని అపోహలను సృష్టిస్తోందని ఆరోపించారు. పూర్వులు చేసిన దేశ విభజనకు ప్రాయశ్చిత్తమే పౌరసత్వ సరవణ చట్టమని సారంగీ పేర్కొన్నారు.