YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు దేశీయం

ఐసీసీ దుమ్ము రేపిన ఇండియన్  ప్లేయర్స్

ఐసీసీ దుమ్ము రేపిన ఇండియన్  ప్లేయర్స్

ఐసీసీ దుమ్ము రేపిన ఇండియన్  ప్లేయర్స్
ముంబై, జనవరి 20,
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో భారత ప్లేయర్లు విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా నెం.1 ర్యాంకును దక్కించుకున్నారు. బ్యాట్స్‌మన్ విభాగంలో భారత కెప్టెన్ కోహ్లీ టాప్‌లో నిలవగా.. బౌలర్ల జాబితాలో నం.1 స్థానాన్ని బుమ్రా నిలబెట్టుకున్నాడు. ఆస్ట్రేలియాతో ఆదివారం మూడు వన్డేల సిరీస్ ముగిసిన అనంతరం సోమవారం తాజాగా ఐసీసీ ఈ ర్యాంకులకు ప్రకటించింది. ఈ సిరీస్‌ను 2-1తో భారత్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.బ్యాట్స్‌మెన్ జాబితాలో కోహ్లీ 886 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. భారత వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ 868 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఈ సిరీస్‌లో భారత్ తరపున వీరిద్దరూ అత్యధిక పరుగులు చేసిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజమ్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. శిఖర్ ధావన్ ఏడు స్థానాలు ఎగబాకి 15వ ర్యాంకుకు చేరుకోగా.. కేఎల్ రాహుల్ 21 స్థానాలు మెరుగుపర్చుకుని 50వ ర్యాంకును దక్కించుకున్నాడు.బౌలర్ల జాబితాలో నం.1 స్థానాన్ని బుమ్రా మరింత పటిష్టం చేసుకున్నాడు. ప్రస్తుతం 764 పాయింట్లతో బుమ్రా.. రెండోస్థానంలో ఉన్న ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్) కంటే ఎంతో ముందంజలో నిలిచాడు. ముజీబుర్ రహ్మాన్ (అఫ్గానిస్థాన్), కగిసో రబాడ (సౌతాఫ్రికా), ప్యాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) టాప్-5లో నిలిచారు. భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రెండు స్థానాలు ఎగబాకి 27వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో నాలుగు ర్యాంకులు మెరుగుపర్చుకుని పదో స్థానం దక్కించుకున్నాడు

Related Posts