YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విపక్షం హుందాగా వుండాలి

విపక్షం హుందాగా వుండాలి

విపక్షం హుందాగా వుండాలి
అమరావతి జనవరి 21,
రాజధాని పరిపాలన వికేంద్రీకరణ బిల్లు ఆమోదం కావడం చాలా సంతోషంగా ఉంది. ఉత్తరాంద్ర, రాయలసీమ ప్రాంతాలు వెనుకబాటు పై ప్రతి కమిటీ లో స్పష్టం గా తెలిపారని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం అయన అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర అయన మాట్లాడారు.  ప్రతిపక్షం లేనిపోని ఆరోపణలు దేనికోసం అని ప్రశ్నిస్తున్నాం. ఎక్కువ సమయం ప్రతిపక్షం కు అవకాశం కల్పించాం. సీఎం మాట్లాడుతున్న సమయంలో అడుగు అడుగునా అడ్డుతగిలారు. ప్రతిపక్షం అంటే హుందాగా వ్యవహరించాలని అన్నారు. చంద్రబాబు అల్లరి ముక్కల్ని రెచ్చగొడుతున్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి ప్రాధాన్యత ఇస్తుంటే ఎందుకు చంద్రబాబు కు ఆక్రోశమని అయన ప్రశ్నించారు. రాయలసీమ ప్రాంతాల్లో చినుకు కోసం కరువు రైతులు ఆకాశానికి ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నారు. శ్రీ బాగ్ ఒడంబడిక చదువుతుంటే మా కంట కన్నీరు వస్తోంది. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమ హైకోర్టు కేటాయించిన సీఎం కు ధన్యవాదాలు. శ్రీకాకుళం లో ఉద్దానం కిడ్నీ భాధితులకు అండగా సీఎం జగన్మోహన్ రెడ్డి నిలుస్తున్నారని అన్నారు. రాయలసీమ వాసులకు చెరువులు ద్వారా సాగునీరు అందించాలని సీఎం ను కొరాం. నిన్న అసెంబ్లీలో ప్రతిపక్షం వ్యవహరించిన తీరు సిగ్గుచేటు మీరు వ్యవహరిస్తున్న తీరు ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అంతా సంబరాలు చేసుకుంటున్నారని అన్నారు. 

Related Posts