YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మండలి రద్దు అవుతుందంటూ మంత్రులు, వైసీపీ కీలక నేతలు మైండ్‌గేమ్

మండలి రద్దు అవుతుందంటూ మంత్రులు, వైసీపీ కీలక నేతలు మైండ్‌గేమ్

మండలి రద్దు అవుతుందంటూ మంత్రులు, వైసీపీ కీలక నేతలు మైండ్‌గేమ్

మండలి రద్దు అవుతుందంటూ మంత్రులు, వైసీపీ కీలక నేతలు మైండ్‌గేమ్

 మండలిలో మెజార్టీగా ఉన్న టీడీపీ సభ్యులను తమవైపు తిప్పుకునేందుకు మైండ్‌గేమ్ మొదలుపెట్టింది. శాసనమండలిలో సీఆర్‌డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులను నెగ్గించుకునేందుకు వైసీపీ సరికొత్త వ్యూహానికి తెరలేపింది.అసెంబ్లీ లాబీల్లో తిరుగుతూ మండలి రద్దు అవుతుందంటూ మంత్రులు, వైసీపీ కీలక నేతలు ప్రచారం చేస్తున్నారు. టీడీపీకి చెందిన మండలి సభ్యులతో మంతనాలు జరుపుతున్నారు. మండలిలో బిల్లు ఆమోదం పొందకపోతే ఇబ్బంది ఎదురవుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఈ కారణంగానే టీడీపీ ఎమ్మెల్సీలపై వైసీపీ మైండ్‌గేమ్ ఆడుతోందనే విశ్లేషకులు భావిస్తున్నారు.ఈ క్రమంలోనే టీడీపీకి చెందిన ఒకరిద్దరు సభ్యులు తమతో టచ్‌లో ఉన్నారని వైసీపీ చెబుతోంది. ఇదిలాఉండగా, ఈరోజు రాత్రికి కేబినెట్ భేటీ ఉంటుందంటూ మరో లీక్ ఇచ్చారు. ఆ భేటీలో మండలి రద్దుకు తీర్మానం ఆమోదిస్తారని ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే మండలి రద్దుకు సంబంధించి శాసనసభ కార్యదర్శి నోటీసులు ఇచ్చారని లాబీల్లో లీకులు ఇచ్చారు. 

Related Posts