YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఢిల్లీలో అసలు త్రిముఖ పోటీ

ఢిల్లీలో అసలు త్రిముఖ పోటీ

ఢిల్లీలో అసలు త్రిముఖ పోటీ
న్యూఢిల్లీ, జనవరి 21,
ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తన నామినేషన్‌ దాఖలు చేసేందుకు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అరవింద్‌ కేజ్రీవాల్‌.. నామినేషన్‌ పత్రాలను దాఖలు చేసేందుకు ఇవాళ ఉదయం ఆయన రిటర్నింగ్‌ ఆఫీసర్‌ కార్యాలయానికి వెళ్లారు. అయితే నామినేషన్లు దాఖలు చేసేందుకు భారీగానే తరలివచ్చారు. కేజ్రీవాల్‌కు 45వ నంబర్‌ కేటాయించారు. సీఎం కంటే ముందున్న 35 మంది అభ్యర్థులు.. సరైన నామినేషన్‌ పత్రాలు లేకుండా, కనీసం 10 మంది మద్దతుదారుల వివరాలు లేకుండా దాఖలు చేసేందుకు వచ్చారు. రిటర్నింగ్‌ ఆఫీసర్‌ వద్దకు చేరుకున్న తర్వాత ఫోన్లలో వివరాలు తెలుసుకుని నామినేషన్‌ పత్రాలను దాఖలు చేసేందుకు అభ్యర్థులు సిద్ధమయ్యారు. దీంతో కేజ్రీవాల్‌ నామినేషన్‌కు తీవ్ర ఆటంకం కలిగింది.ఈ విషయాన్ని గ్రేటర్‌ కైలాష్‌ ఎమ్మెల్యే సౌరభ్‌ భరద్వాజ్‌ తన ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ఇక ఇదే విషయాన్ని కేజ్రీవాల్‌ కూడా తన ట్విట్టర్‌ ద్వారా చెప్పారు. నామినేషన్‌ దాఖలు చేసేందుకు వేచి చూస్తున్నా.. తన టోకెన్‌ నంబర్‌ 45. నామినేషన్‌ దాఖలు చేసేందుకు భారీ సంఖ్యలో అభ్యర్థులు తరలివచ్చారు. ఇంత మంది నామినేషన్‌ దాఖలు చేసేందుకు రావడం సంతోషంగా ఉందని కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు.ఇక నామినేషన్ల పరిశీలన జనవరి 22న జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జనవరి 24. ఫిబ్రవరి 8న పోలింగ్‌ జరగనుంది. 11న ఫలితాలు వెల్లడికానున్నాయి.ఈ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌), బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య త్రిముఖ పోటీ ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆప్‌ అధికారంలోకి రాకముందు 15 ఏండ్లు పాలించిన కాం గ్రెస్‌ గత ఎన్నికల్లో ఒక్క సీటూ గెలువలేదు. మొత్తం 70 సీట్లకు ఆప్‌ 67, బీజేపీ మూడింటిని గెలుచుకున్నాయి. గత మే నెలలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు స్థానాలను గెలుచుకున్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తన సత్తా చాటాలని చూస్తున్నది. ఇక కాంగ్రెస్‌ తన పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తున్నది

Related Posts