YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విజయవాడలో రిపబ్లిక్ డే వేడుకలు

విజయవాడలో రిపబ్లిక్ డే వేడుకలు

బెజవాడలోనే రిపబ్లిక్...
విజయవాడ, జనవరి 21
రిపబ్లిక్ డే వేడుకలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందు విశాఖపట్నంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలని భావించిన సర్కార్.. ఇప్పుడు ఉన్నట్టుండి నిర్ణయం మార్చుకున్నట్లు సమాచారం. విశాఖలో కాకుండా విజయవాడలోనే వేడుకలు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారట. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని ఆదేశించినట్లు తెలుస్తోంది.జగన్ నిర్ణయం వెనుక ఆసక్తికర కారణాలు ఉన్నాయనే చర్చ మొదలయ్యింది. విజయవాడలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించడం ద్వారా అమరావతి ప్రాంతంలో ప్రజలకు ఓ విధమైన భరోసా ఇవ్వాలని ఏపీ ముఖ్యమంత్రి భావిస్తున్నారట. అందుకే విశాఖలో కాకుండా బెజవాడవైపు మొగ్గు చూపారట. దీంతో నగరంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో వేడుకల్ని నిర్వహించనున్నారట.జనవరి 26న రిపబ్లిక్ డేను వైజాగ్‌లోనే నిర్వహించేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన రిహార్సల్‌ కూడా జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో.. ఉన్నట్టుండి నిర్ణయం మార్చుకోవడం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు మరో ఐదు రోజులే సమయం ఉండటంతో విజయవాడలో ఏర్పాట్లు ఎలా చేస్తారన్నది చూడాలి.

Related Posts