భవానిపురంలో మంత్రి వెల్లంపల్లి పర్యటన
విజయవాడ జనవరి 22
భవానిపురం 28వ డివిజన్ లో ప్రజా సమస్యలపై బుధవారం ఉదయం దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మున్సిపల్ అధికారులు పర్యటించారు. మంత్రి మాట్లాడుతూ సీఎం జగన్ విజయవాడ నగర అభివృద్ధి పై దృష్టి పెట్టారు. చంద్రబాబు నాయుడు విజయవాడ నగర అభివృద్ధిని తుంగలో తొక్కారు. త్వరితగతిన రోడ్డు,డ్రైనేజీలు పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పవన్ కళ్యాణ్ ది నోరా తాటి మట్ట అని ప్రశ్నించారు. మాటమీద నిలబడా లేని రాజకీయంలో స్థిరత్వం లేని వ్యక్తి వపవన్ కళ్యాణ్. రెండు నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ ను ప్రజలు ఓడించిన బుద్ధి రాలేదు. ఉదయం సినిమా షూటింగులు.. సాయంత్రం చంద్రబాబుతో షూటింగులని విమర్శించారు. చంద్రబాబు డైరెక్షన్లో బిజెపి ముసుగులో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఆపాలని చూస్తే సహించేది లేదు..జాగ్రత్త అని అన్నారు. సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు, ఆంధ్ర ప్రజల నీకు సరైన బుద్ధి చెప్తారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఆపాలని చూస్తే ఆంధ్రప్రదేష్ లో ఎక్కడా తిరగలేవు. జగన్ మీద అవాకులు పేలటం మాని షూటింగ్స్ అన్నా చేసుకో. లేకపోతే రాజకీయలన్నా చేసుకోమని అన్నారు.