YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ సభ్యులపై రాపాక విమర్శలు

టీడీపీ సభ్యులపై రాపాక విమర్శలు

టీడీపీ సభ్యులపై రాపాక విమర్శలు
అమరావతి జనవరి 22    
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి వార్తల్లోకి వచ్చారు. తాజాగా బుధవారం నాడు అయన చేసిన వ్యాఖ్యాలు అయన అనధికారికంగా వైసీపీలో చేరినట్టు స్పష్టం చేశాయి. అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేసిన టీడీపీ సభ్యులపై విమర్శలు గుప్పించారు. ఒక ముఖ్యమైనటు వంటి అంశంపై చర్చ జరుగుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్లు చేస్తున్న అల్లరి దారుణమని రాపాక వ్యాఖ్యానించారు. తక్కువ మంది ఉన్నా ఎక్కువ అల్లరి చేస్తున్నారని టీడీపీ సభ్యులను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. స్పీకర్ను కొడతారేమోనన్న భ్రమ కలిగించే విధంగా టీడీపీ సభ్యులు ప్రవర్తించారని రాపాక విమర్శించారు. టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన స్పీకర్ను కోరారు.

Related Posts