ఇది మీ ఇల్లు అనుకుంటున్నారా?..మండిపడ్డ స్పీకర్
అమరావతి జనవరి 22
అసెంబ్లీలో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం అసహనం వ్యక్తం చేశారు. ఇది మీ ఇల్లు అనుకుంటున్నారా..? సభ అనుకుంటున్నారా..? అని స్పీకర్ మండిపడ్డారు. దయచేసి తమ సీట్లల్లో కూర్చోవాలని స్పీకర్ పదేపదే విజ్ఞప్తి చేశారు. టీడీపీ సభ్యులు పదేపదే గందరగోళం సృష్టిస్తుండటం, పోడియం రింగ్ దాటి వస్తే మార్సల్స్ను రంగంలోకి దించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పీకర్ను కోరారు. స్పీకర్ పోడియం వద్ద టీడీపీ సభ్యులు జై అమరావతి అంటూ నిరసన చేయడంతో స్పీకర్ మార్షల్స్ను పిలిపించారు. టీడీపీ సభ్యులను బయటకు తీసుకెళ్లేందుకు మార్షల్స్ ప్రయత్నిస్తుండటంతో మిగతా టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.