YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఢిల్లీ ఎన్నికల కోసం40 మందితో కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్ల జాబితా 

ఢిల్లీ ఎన్నికల కోసం40 మందితో కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్ల జాబితా 

ఢిల్లీ ఎన్నికల కోసం40 మందితో కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్ల జాబితా 
న్యూఢిల్లీ జనవరి 22 
: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ 40 మందితో కూడిన స్టార్ క్యాంపైనర్ల జాబితా విడుదల చేసింది. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. కాగా గతేడాది జూలైలో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్‌‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తన మంత్రి పదవికి సిద్దూ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బహిరంగ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించని సిద్ధూను కాంగ్రెస్ అధిష్టానం మళ్లీ తెరమీదికి తీసుకురావడం గమనార్హం. స్టార్ క్యాంపైనర్ల జాబితా సిద్ధూ, గాంధీ కుటుంబ సభ్యులతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెప్టెన్ అమరీందర్ సింగ్ (పంజాబ్), అశోక్ గెహ్లాట్ (రాజస్థాన్), కమల్‌నాథ్ (మధ్య ప్రదేశ్), భూపేశ్ బాఘెల్ (చత్తీస్‌గఢ్), వి. నారాయణ స్వామి (పుదుచ్చేరి) కూడా ఉన్నారు. రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ కూడా ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారు. ఇక గతేడాది బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రముఖ నటుడు శత్రుఘ్న సిన్హా కూడా కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్‌గా వ్యవహరించనున్నారు. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ సుభాష్ చోప్రాతో పాటు ఆ పార్టీ నేతలు అజయ్ మాకెన్, మీరా కుమార్, రాజ్ బబ్బార్, కపిల్ సిబల్, శశ థరూర్, భూపేంద్ర సింగ్ హుడా, రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా, కీర్తి ఆజాద్, సుష్మితా దేవ్, షర్మిష్ఠ ముఖర్జీ తదితరులు కూడా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మొత్తం 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే నెల 8న ఎన్నికలు జరగనున్నాయి. అదే నెల 11న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి
 

Related Posts