YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

 రిపబ్లిక్ డే ఉత్సవాలకు సిద్ధమైన ఢిల్లీ

 రిపబ్లిక్ డే ఉత్సవాలకు సిద్ధమైన ఢిల్లీ

 రిపబ్లిక్ డే ఉత్సవాలకు సిద్ధమైన ఢిల్లీ
న్యూ ఢిల్లీ జనవరి 22,
రిపబ్లిక్ డే ఉత్సవాలకు దేశ రాజధాని ఢిల్లీ సిద్ధమైంది. ఈసారి ఉత్సవాలకు బ్రెజిల్ అధ్యక్షుడు  బోలో సో నా రో ముఖ్య అతిథిగా హాజరు అవుతున్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ గోవింద్ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  తో పాటు కేంద్ర మంత్రులు త్రివిధ దళాల అధిపతులు హాజరవుతారు. రిపబ్లిక్ డే ఉత్సవాలు జరిగే రాజ్ పాత్ ఏరియా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈసారి ఉత్సవాల్లో అగ్ని విశాల్ నాగ్ వంటి క్షిపణులు, డీఆర్డీవో, రక్షణ శాఖ తన ఆయుధ సంపత్తిని ప్రదర్శించు ఉన్నాయి. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన శకటాలను ఈ ఉత్సవాల్లో ప్రదర్శిస్తారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.  రిపబ్లిక్ డే ఉత్సవాల నేపథ్యంలో ఢిల్లీ లో భద్రతను భారీగా పెంచారు. పబ్లిక్ డే ఉత్సవాలు జరుగనున్న రాజ్యసభ ఏరియాను భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. పారామిలిటరీ ఫోర్సెస్ దళాలు విన్యాసాలు, గజ అశ్వ దళాలు ప్రత్యేక ప్రదర్శనలు ఇస్తాయి. రిపబ్లిక్ డే ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి రక్షణశాఖ అన్ని చర్యలు తీసుకుంటుంది. డబ్ల్యూ డి వచ్చేవాళ్ళు పాల్గొని పారామిలిటరీ ఫోర్సెస్, మిగిలిన అన్ని దళాలు కూడా రాజ్ పథ్ లో రిహాల్సెస్ చేస్తున్నాయి.

Related Posts