వ్యక్తిగత భద్రతను ఉపసంహరించుకొన్న ఎంపీ బండి సంజయ్
కరీంనగర్ జనవరి 22
: తన వ్యక్తిగత భద్రతను ఉపసంహరించుకొని ఎంపీ బండి సంజయ్ వాపస్ పంపారు. రెండు రోజుల క్రితం ఏర్పాటు చేసిన ప్రత్యేక భద్రతను కూడా ఉపసంహరించుకుని వెనక్కి పంపించేశారు. రెండు రోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో రాళ్ల దాడి జరిగిందంటూ కరీంనగర్ పోలీసులు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. రాళ్ల దాడి జరగలేదని కరీంనగర్ పోలీస్ కమిషనర్ చేసిన ప్రకటనపై స్పందించి బండి సంజయ్ తన భద్రతను ఉపసంహరించుకున్నారు.