YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

తెలంగాణకు పిరమల్ గ్రూప్...

తెలంగాణకు పిరమల్ గ్రూప్...

తెలంగాణకు పిరమల్ గ్రూప్...
హైద్రాబాద్, జనవరి 22, 
తెలంగాణలో రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ప్రముఖ ఫార్మా సంస్థ పిరమాల్ గ్రూప్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఉన్న పిరమాల్ ఫార్మాను విస్తరించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ సీనియర్ ప్రతినిధులు వెల్లడించారు. ఈ మేరకు రానున్న మూడు సంవత్సరాల్లో రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించారు. తద్వారా ప్రస్తుతం తెలంగాణలో కంపెనీకి ఉన్న 1400 మంది ఉద్యోగులకు అదనంగా మరో 600 మందికి ఉద్యోగాలు లభిస్తాయని వివరించారు.రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించడంలో భాగంగా ప్రస్తుతం ఐటీశాఖ మంత్రి కేటీఆర్ దావోస్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆయన మంగళవారం ప్రసంగించారు. ఈ సందర్భంగా దిగ్గజ పారిశ్రామిక వేత్తలు, సీఈవోలతో సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే దావోస్‌లో మంత్రి కేటీఆర్ పిరమాల్ గ్రూప్ ఛైర్మన్‌తో సమావేశమయ్యారు. మంత్రి కేటీఆర్‌తో సమావేశం అనంతరం ఈ భారీ పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో పెట్టే పెట్టుబడులతో మరో 600 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశం కలుగుతుందని అజయ్ పిరమాల్ కేటీఆర్‌తో అన్నట్లు తెలుస్తోంది.రూ.500 కోట్ల పెట్టుబడుల్లో భాగంగా వచ్చే నెల ఫిబ్రవరిలో పిరమాల్ గ్రూపునకు చెందిన సీనియర్ ప్రతినిధుల టీమ్ తెలంగాణలో పర్యటించనుంది. తెలంగాణలో ఉన్న ప్రభుత్వ విధానాలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం ఇతర రాష్ట్రాల్లోని ప్లాంట్లను హైదరాబాద్‌కి తరలించే అంశాన్ని పరిశీలిస్తామని గ్రూపు అధినేత వెల్లడించారు. అజయ్ పిరమాల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి వియ్యంకుడు. అతని కుమారుడు ఆనంద్ పిరమాల్‌ను అంబానీ కుమార్తె ఇషా అంబానీ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

Related Posts