YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 వైసీపీ గూటికి టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత

 వైసీపీ గూటికి టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత

 వైసీపీ గూటికి టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత
విజయవాడ, జనవరి 22, 
టీడీపీకి ఎమ్మెల్సీ పోతుల సునీత గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఆమె వైఎస్సార్‌సీపీలో చేరేందుకు ముహూర్తం ఖాయం చేసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకునేందుకు ఫిక్స్ అయ్యారట. పదవికి రాజీనామా చేసి పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. బుధవారం సాయంత్రం చేరిక కార్యక్రమం ఉంటుందని ప్రచారం జరుగుతోంది.పోతుల సునీత శాసనమండలిలో రూల్‌ 71పై జరిగిన ఓటింగ్‌లో వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఓటేశారు. టీడీపీ జారీ చేసిన విప్‌ను ధిక్కరించి.. ఆ పార్టీ సభ్యులకు పెద్ద షాక్ ఇచ్చారు. మొన్నటి వరకు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె.. ఉన్నట్టుండి అధికార పార్టీకి అనుకూలంగా ఓటు వేయడం హాట్‌టాపిక్ అయ్యింది. నిన్నటి నుంచే ఆమె పార్టీ మారతారనే ఊహాగానాలు వినిపించాయి.పోతుల సునీత పరిటాల రవి అనుచరుడైన పోతుల సురేష్‌ సతీమణి. ఆమె 2014లో ప్రకాశం జిల్లా చీరాల నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. తర్వాత ఆమంచి కృష్ణమోహన్ టీడీపీలో చేరడంతో.. ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి చంద్రబాబు ప్రాధాన్యం కల్పించారు. అలాగే తెలుగు మహిళా అధ్యక్షురాలిగా అవకాశం ఇచ్చారు. 2019 ఎన్నికల్లో కూడా చీరాల నియోజకవర్గంలో పార్టీ కోసం, టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేశారు. మొన్నటి వరకు పార్టీ కార్యక్రమాల్లో చరుకుగా పాల్గొన్న ఆమె.. ఉన్నట్టుండి ఆమె వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఓటేయడం టీడీపీకి ఒకింత షాక్ అనే చెప్పాలి.

Related Posts