YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

 కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో పవన్ భేటీ

 కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో పవన్ భేటీ

 కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో పవన్ భేటీ
న్యూఢిల్లీ జనవరి  22 
కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ బుధవారం నాడు మధ్యాహ్నం సమావేశమయ్యారు. బుధవారం నాడు అమరావతి నుండి హైద్రాబాద్‌కు చేరుకొన్నారు.పవన్ కళ్యాణ్. శంషాబాద్ విమానాశ్రయం నుండి పవన్ కళ్యాణ్ ‌ బుధవారం నాడు ఉదయం ఢిల్లీకి వెళ్లారు.న్యూఢిల్లీకి చేరుకొన్న తర్వాత పవన్ కళ్యాణ్ కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి  నిర్మలా సీతారామన్ తో సమావేశమయ్యారు. అమరావతిలోనే రాజధాని ఉంటుందని పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు రాజధాని రైతులకు హామీ ఇచ్చారు.ఏపీకి మూడు రాజధానులు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులతో పాటు ఏపీ ఆర్ధిక పరిస్థితులు, అభివృద్ధి తదితర అంశాలపై బీజేపీ, జనసేన నేతలు చర్చించారు. సుమారు గంటకు పైగా బీజేపీ, జనసేన నేతలు సమావేశమయ్యారు.బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కూడ  పవన్ కళ్యాణ్ భేటీ అయ్యే అవకాశం ఉంది.  బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుతో కలిసి పవన్ కళ్యాణ్ కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకొంది.మూడు రాజధానులను వ్యతిరేకించే విషయంలో ఏ రకంగా ముందుకు వెళ్లాలనే దానిపై కూడ బీజేపీ, జనసేన పార్టీల మధ్య బుధవారం నాడు చర్చ జరిగే అవకాశం ఉంది.  ఈ  రెండు పార్టీల స

Related Posts