మహిళా పోలీసులకు అవమానిస్తున్నారు
విజయవాడ జనవరి 22
మహిళా పోలీసులు మందడం జడ్పి హై స్కూల్ వద్ద వసతి కల్పించాం. మహిళ పోలీసు దుస్తులు మార్చుకుంటుంటే ఫొటోస్, వీడియోలు తీశారు. ఇప్పటి వరకు ఉన్న ఆధారాలు ప్రకారం ముగ్గురు కెమెరామెన్ లు మీద నిర్భయ కేసు నమోదు చేసామని తెనాలి డిఎస్పీ శ్రీ లక్ష్మి వెల్లడించారు. సిఐడి అడిషనల్ ఎస్పీ సరిత మాట్లాడుతూ మీడియా ప్రజాస్వామ్యం కి నాలుగో ఎస్టేట్. మహిళ పట్ల ఇలాంటి ఘటన ఊహించలేదు. మహిళలకి చైతన్యం కలిగించాల్సిన మీడియా ఇలా చేస్తే ఎలా అని ప్రశ్నించారు. మహిళా పోలీసులు పట్ల ఇలా వ్యవహరించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విశాఖ డిఎస్పీ ప్రేమ్ కాజల్ మాట్లాడుతూ మహిళా పోలీసుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే ఉరుకొం. మహిళా పోలీసులు ఉన్న రూం లోకి వచ్చి ఫొటోస్ వీడియోస్ తీస్తే చూస్తూ ఉరుకొం. మహిళ పోలీసులను కించపరిచేలా మాట్లాడారని ఆరోపించారు. మహిళా కానిస్టేబుల్ పట్ల సోషల్ మీడియా లో ట్రోల్ చేస్తున్నారు.తప్పు చేసిన వారు ఎవరన్నా చట్ట పరంగా చర్యలు ఉంటాయని అన్నారు.