YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం తెలంగాణ

దివీస్ కంపెనీపై రైతుల ఫిర్యాదు

దివీస్ కంపెనీపై రైతుల ఫిర్యాదు

దివీస్ కంపెనీపై రైతుల ఫిర్యాదు
హైదరాబాద్ జనవరి 24  
చౌటుప్పల్ లోని దివీస్ కంపెనీ పై స్థానిక రైతులు మంత్రి శ్రీనివాస్ యాదవ్ కి ఫిర్యాదు చేసారు. శుక్రవారం నాడు మంత్రిని కలిసిన రైతులు  లింగోజిగూడెం లో ఉన్న దివీస్ ఫార్మా కంపెనీ కి సంబంధించి 132 కెవి విద్యుత్ లైన్లు చౌటుప్పల్ సబ్ స్టేషన్ నుండి తమ పొలాల మీదుగా గా తీసుకెళ్తున్నారని మంత్రికి ఫిర్యాదు చేసారు. సబ్ స్టేషన్ నుండి రోడ్డు వెంట కరెంటు లైన్ తీసుకు వెళ్తే డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయని మా పొలాలు పైనుండి విద్యుత్ వైర్లను తీసుకెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. కరెంటు లైను అడ్డుకున్న దివిస్ ఫార్మా కంపెనీ యాజమాన్యం..రైతులపై  అక్రమ కేసులు పెట్టిస్తున్నదని ఫిర్యాదు లో పేర్కోన్నారు. బలవంతంగా వచ్చి తమ పొలాల్లో కరెంటు స్తంభాల కోసం గుంతలు తవ్వుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేపారు. కరెంట్ లైను రోడ్డు మీదుగా తీసుకువెళ్లేట్టు చర్యలు తీసుకోవాలని మంత్రిని రైతులు కోరారు. 

Related Posts