ఒక్క ఓటు మెజారిటీతో తెరాస అభ్యర్థి గెలుపు...
మేడ్చల్ జనవరి 25
మేడ్చల్ జిల్లా కుత్బుల్లా పూర్ నియోజకవర్గ పరిధి కొంపల్లిలో 3వ వార్డు ఎన్నిక ఆధ్యంతం ఉత్కంఠగా సాగింది.... తెరాస అభ్యర్థి సన్న శ్రీశైలం యాదవ్ సమీప బీజేపీ అభ్యర్థి కొలను మోహన్ రెడ్డిపై ఒక్క ఓటు మెజారిటీతో విజయం సాధించారు. అయితే నియమ, నిబంధనలకు తూట్లు పొడుస్తూ రిటర్నింగ్ అధికారిని కాదని మున్సిపల్ కమిషనర్ చెల్లని ఓటును పరిగణలోకి తీసుకొని తెరాస అభ్యర్థిని విజేతగా ప్రకటించినట్లు బీజేపీ అభ్యర్థి కొలను మోహన్ రెడ్డి ఆరోపించారు.