కమలం బోణి
రంగారెడ్డి, జనవరి 25,
మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ కొన్ని వార్డుల్లోనే విజయం సాధించింది. రంగారెడ్డి జిల్లా ఆమన్ గల్ మున్సిపాలిటీలో మాత్రం బీజేపీ బోణీ కొట్టింది. మొత్తం 15 వార్డులున్న ఆ మున్సిపాలిటీలో బీజేపీ 12 స్థానాల్లో గెలుపొందగా ఇండిపెండెంట్లు ఒక్క స్థానంలో గెలిచారు. మిగతా స్థానాల్లోనూ బీజేపీ లీడ్ లో ఉంది. ఇక టీఆర్ఎస్ ఒకే ఒక్క స్థానానికే పరిమితం అయ్యింది. ఎన్నికల్లో పలుచోట్ల కాంగ్రెస్ కంటే బీజేపీ అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించిన భైంసాలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 14 పోల్ అవ్వగా.. బీజేపీకి 8, ఎంఐఎం 3, కాంగ్రెస్ 1,ఇతరులకు 1 ఓటు దక్కించున్నారు. అయితే ఇప్పటికే వెలువడిన ఫలితాల్లో నాలుగు వార్డుల్లో ఎంఐఎం విజయం సాధించింది. ఆర్మూర్ మున్సిపాలిటీలో 7 వార్డుల్లో బీజేపీ గెలుపొందింది. మరోవైపు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నాలుగు వార్డుల్లో బీజేపీ విజయం సాధించింది. మరికొన్ని వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. పలు వార్డుల్లో రెండో స్థానంలో కొనసాగుతున్నారు.