ఎమ్మెల్యేల హక్కులను హరిస్తున్నారు
రాజమండ్రి జనవరి 25
చట్టాన్ని చుట్టంగా మార్చి నియంతృత్వపాలన చేస్తూ రాష్ట్రాన్ని బ్రఘ్ట పట్టించిన ఘనుడు ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి అని రాజమండ్రి రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మాటే వేదంగా పని చేస్తూ తన పదవి, భాద్యత, గౌరవాన్నీ జగన్మోహన్ రెడ్డి పాదాల దగ్గర పెట్టిన స్పీకర్ తమ్మినేని సీతారాం అని విమర్శించారు. శాసనసభ సమావేశాలలో శాసనసభ్యుల హక్కులను హరిస్తున్నారని అన్నారు. ప్రతిపక్షం గోంతు నోక్కుతు దుర్మార్గానికి ఒడిగడుతున్నారని అన్నారు.