రాష్ట్రంపై భస్మాసుర హస్తం
అమరావతి జనవరి 25
మనం డేమోక్రసి లో ఉన్నామా. జగన్ కసి లో ఉన్నామా..ఒక్క చాన్స్ అంటూ వచ్చిన జగన్ భస్మాసుర హస్త్రం రాష్ట్రం పై పెట్టాడని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. మండలి రద్దు పై తీర్మానం మాత్రమే రాష్ట్రం చేస్తుంది. మండలి రద్దుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారమే లేదు. కేంద్రం రాష్ట్ర తీర్మానాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వానికి అంత పట్టుదల గా ఉంటే శాసన సభ కూడా రద్దు చెయ్యండి. చైర్మన్ కు అధికారం లేదని కొత్త పల్లవి మొదలు పెట్టారు. తుది నిర్ణయం కాకుండా ఏ శాఖ కదల్చ కూడదని హై కోర్టు చెప్పింది. చైర్మన్ బిల్స్ సెలక్ట్ కమిటీ కి పంపలేదని అసత్య ప్రచారం చేస్తున్నారు. మంత్రుల కు బుర్ర ఉందా లేదా అనిపిస్తుందని అయన వ్యాఖ్యానించారు.