ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం టీఆర్ఎస్ దే: హరీశ్ రావు
హైదరాబాద్ జనవరి 25
మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనం కనిపిస్తోందని రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం టీఆర్ఎస్ దేనని మరోసారి రుజువైందన్నారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు అభినందనలు చెప్పారు. విజయానికి కృషి చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు శుభాకాంక్షలు తెలిపారు. పుర పాలిక ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయ దుందుభి మోగించింది.అత్యధిక మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకపక్ష విజయం సాధిస్తున్నారు. అనేక మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ కు కాంగ్రెస్, బిజెపి పోటీ ఇవ్వలేకపోయాయి. 120 మున్సిపాలిటీలకుగాను 109 పురపాలికల్లో టీఆర్ఎస్, ఒక చోట ఎంఐఎం ఆధిక్యంలో నిలిచాయి. కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ శ్రేణుల సంబురాలు చేసుకుంటున్నాయి.