YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 మాజీ మంత్రి ఆలపాటిపై వైసీపీ నేతల దాడి

 మాజీ మంత్రి ఆలపాటిపై వైసీపీ నేతల దాడి

 మాజీ మంత్రి ఆలపాటిపై వైసీపీ నేతల దాడి
గుంటూరు, జనవరి 25,
గుంటూరు జిల్లా తెనాలిలో శాంతియుతంగా దీక్ష చేస్తున్న మాజీ మంత్రి ఆలపాటి రాజా, ఇతర నిరసనకారులపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడినట్లు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ట్వీట్ చేశారు. రాజా సహా ఇతరులపై కోడిగుడ్లతో దాడి చేసి, ధర్నా క్యాంప్‌కు నిప్పుపెట్టినట్లు తెలిపారు. వైసీపీ నేతల పిరికిచర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. సమస్యలు, పరిస్థితులను చక్కదిద్దేందుకు వైపీపీ ప్రభుత్వం దగ్గర ఉన్న పరిష్కార మార్గాలు బెదిరింపులు, హింస మాత్రమేనని వ్యాఖ్యానించారు. తన ట్వీట్‌కు ఏబీఎన్ చానెల్ వీడియో లింక్‌ను ఎంపీ జయదేవ్ జోడించారు.కాగా, అమరావతి రిలే దీక్ష శిబిరంపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. దీంతో తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ వర్గీయులు తోపులాటకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలో పలువురు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఆలపాటి రాజా సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలకు నచ్చజెప్పే యత్నం చేశారు.ఘటనపై టీడీపీ టౌన్ అధ్యక్షుడు మొహమ్మద్ కుదుష్ మాట్లాడుతూ.. శాంతియుతంగా రాజధాని కోసం నిరసన చేస్తున్న తమపై వైసీపీ నాయకులు దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. పోలీసులు పక్కనే ఉన్నా కనీసం దాడిని ఆపే ప్రయత్నం కూడా చేయలేదని ధ్వజమెత్తారు. మరోవైపు టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన అమరావతి దీక్షా శిబిరాన్ని తొలగించేందుకు పోలీసులు, మున్సిపల్ సిబ్బంది సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Related Posts