YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

 కిలేడి లేడి ఖతర్నాక్ ప్లాన్

 కిలేడి లేడి ఖతర్నాక్ ప్లాన్

 కిలేడి లేడి ఖతర్నాక్ ప్లాన్
హైద్రాబాద్, జనవరి 25 
పొట్టకూటి కోసం హైదరాబాద్ నగరానికి వచ్చిందో కుటుంబం. భర్త ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా భార్య ఇంట్లోనే ఉండేది. అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో భర్తకు స్నేహం ఏర్పడడంతో అతను తరచూ ఇంటికి వస్తుండేవాడు. ఈ క్రమంలో భర్త స్నేహితుడితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త లేని సమయంలో ప్రియుడితో రాసలీలలు సాగించేది. విషయం కాస్త కొద్దిరోజులకు భర్తకి తెలియడంతో ఇద్దరినీ మందలించాడు. మరోసారి జరిగితే బాగుండదని హెచ్చరించాడుతమ అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భావించిన భార్య.. ఎలాగైనా భర్తను అంతమొందించాలని ప్లాన్ వేసింది. తన భర్తను చంపేస్తే ఎంచక్కా ఇద్దరం హాయిగా ఉండొచ్చని ప్రియుడిని హత్యకు ప్రేరేపించింది. ఆమె ప్రోద్బలంతో భర్తను దారుణంగా హత్య చేశాడు ప్రియుడు. అయితే ఇక్కడే కథ అడ్డం తిరిగింది. భర్తను చంపించిన భార్యే.. తన భర్తను దారుణంగా చంపేశాడంటూ ప్రియుడిపై పోలీసుకు ఫిర్యాదు చేయడంతో కంగుతిన్నాడు ప్రియుడు. చివరికి పోలీసు స్టై‌ల్లో విచారించడంతో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కిలేడీ ఖతర్నాక్ ప్లాన్ విని పోలీసులు సైతం షాక్‌కు గురయ్యారు. .మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలంలోని కుర్తివాడకు చెందిన ముక్కుట్ల యాదాగౌడ్‌ (35), సౌజన్య భార్యాభర్తలు. ఐదేళ్ల క్రితం హైదరాబాద్‌ నగరానికి వలస వచ్చి దుండిగల్ పరిధిలోని చర్చి గాగిల్లాపూర్‌లో నివాసం ఉంటున్నారు. యాదాగౌడ్‌ ఆటో ఫైనాన్స్‌ కంపెనీలో పని చేస్తుండగా భార్య ఇంట్లోనే ఉండేది. కొద్దికాలానికే అదే ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్‌ షేక్‌ ఆసిఫ్‌తో యాదాగౌడ్‌ ఫ్రెండ్స్ అయ్యారు.స్నేహితుడి కోసం ఆసిఫ్ తరచూ యదాగౌడ్‌ ఇంటికి వచ్చి వెళ్లే క్రమంలో సౌజన్యతో అక్రమ సంబంధం కుదిరింది. భర్త లేని సమయంలో ఆమె.. ప్రియుడితో రాసలీలలు సాగించేది. ఇద్దరూ ఏకాంతంగా మాట్లాడుకోవడానికి ప్రియుడు ఫోన్ కూడా కొనిచ్చాడు. భర్తకు తెలియకుండా భార్య ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడేది. యాదాగౌడ్‌‌కి విషయం తెలిసి ఇద్దరినీ మందలించాడు. భర్తకు విషయం తెలిసిపోవడంతో ఎలాగైనా భర్తను చంపేయాలని భార్య పథకం రచించిందిభర్త తనను వేధిస్తున్నాడని.. అతనిని చంపేస్తే ఎంచక్కా హాయిగా ఇద్దరం కలిసి ఉండొచ్చని ప్రియుడు ఆసిఫ్‌కి ఫోన్ చేసి చెప్పింది సౌజన్య. భర్తను హత్య చేసేందుకు ప్రేరేపించింది. ప్రియురాలి కోరిక మేరకు ఆసిఫ్.. పార్టీ చేసుకుందామని చెప్పి యాదాగౌడ్‌‌ను చర్చి గాగిల్లాపూర్‌లోని డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల వద్దకు తీసుకెళ్లాడు. ఫుల్లుగా మద్యం తాగిన తరువాత ఆసిఫ్ తన వెంట తెచ్చుకున్న కత్తితో యాదాగౌడ్‌ను దారుణంగా పొడిచి చంపేశాడు. నేరుగా ప్రియురాలి వద్దకు వెళ్లి భర్తను చంపిన విషయం చెప్పాడు.అంతే.. ఒక్కసారిగా కథ అడ్డం తిరిగింది. తన భర్త యాదాగౌడ్‌ను ఆసిఫ్ హత్య చేశాడని.. అతనిపై చర్యలు తీసుకోవాలంటూ సౌజన్య పోలీసులకు ఫిర్యాదు చేసి ప్రియుడికి షాకిచ్చింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆసిఫ్‌ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో సౌజన్యతో అక్రమ సంబంధం.. ఆమె ప్రోద్బలంతోనే చంపేసినట్లు ఆసిఫ్ ఒప్పుకున్నాడు. ఆమెకు ఫోన్‌ కూడా కొనిచ్చానని, ఇద్దరం మాట్లాడుకునే వాళ్లమని చెప్పడంతో భర్తను తానే చంపించి ప్రియుడిని బుక్ చేసిన కిలాడీ లేడీ ప్లాన్ విని పోలీసులే నిర్ఘాంతపోయారునిందితుడు ఆసిఫ్ ఇచ్చిన సమాచారం మేరకు సౌజన్యను అదుపులోకి తీసుకున్న పోలీసులకు విచారణలో వింత అనుభవం ఎదురైంది. హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని బుకాయించింది. అంతేకాకుండా ఇంటికి వచ్చిన ప్రతిసారీ ఆసిఫ్‌ వెకిలి చూపులు చూసేవాడని.. ఈ విషయం తన భర్తకు చెప్పడంతో అతడిని మందలించినట్లు స్టోరీ అల్లింది. ఆసిఫ్‌ ఇచ్చిన ఫోన్‌ నంబర్‌ కాకుండా మరో నంబర్ పోలీసులకు ఇచ్చింది.సౌజన్య ట్విస్ట్‌తో పోలీసులు ఆలోచనలో పడ్డారు. మరోసారి ఆసిఫ్‌ను పోలీస్ స్టైల్లో విచారించడంతో అతను కొనిచ్చిన ఫోన్ నంబర్ ఆధారంగా కాల్‌ డేటాను పోలీసులు సేకరించడంతో కిల్లర్ లేడీ బాగోతం బయటకు వచ్చింది. తరచూ ప్రియుడితో రాసలీలల సంభాషణలు.. భర్తను హత్య చేయాలని ప్రేరేపించినట్లు గుర్తించిన పోలీసులు నిందితులిద్దరినీ అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే తండ్రి హత్యకు గురవడం.. తల్లి జైలుకు వెళ్లడంతో వారి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.

Related Posts