YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం విదేశీయం

 రోజు రోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ మృతులు

 రోజు రోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ మృతులు

 రోజు రోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ మృతులు
బీజింగ్, జనవరి 27
 చైనాలో కరోనా వైరస్‌ మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ భయంకర వైరస్‌ బారినపడి ఇప్పటివరకు 80 మంది మరణించారు. ఇప్పటివరకు చైనాలో మొత్తం 2,300 మంది ఈ వైరస్‌ బారినపడినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ప్రతి రోజు దాదాపు 300 నుంచి 500 మందికి ఈ వ్యాధి సోకుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. జలుబు, దగ్గుతో మొదలవుతున్న ఈ వ్యాధి ముదురుతూ.. నిమోనియాగా మారి ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీస్తోంది. చైనాతో పాటు జపాన్‌, తైవాన్‌, నేపాల్‌, హాంగ్‌కాంగ్‌, వియత్నాం, మలేషియా, సింగపూర్‌, దక్షిణకొరియా, థాయ్‌లాండ్‌ తదితర దేశాలకు కూడా కరోనా వైరస్‌ వ్యాపించింది. కాగా, చైనా ఈ వ్యాధి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. వైరస్‌ను కట్టడి చేయడానికి చైనా వైద్యులు వ్యాక్సిన్‌ తయారీలో బిజీగా ఉన్నారు. భారత్‌లో ఈ వైరస్‌ ప్రవేశించనప్పటికీ.. అన్ని ప్రధాన విమానాశ్రయాల్లో ప్రత్యేక థెర్మల్‌ స్క్రీనింగ్‌ టెస్టులు జరుపుతున్నారు. 

Related Posts