ప్రపంచ మేధావిగా ఫీలువుతున్న యనమల
అమరావతి జనవరి 27
పెద్దల సభ సలహా లు ఇచ్చే విధంగా వుండాలి. కానీ వివాదం సృష్టించే విధంగా వుండరాదు.
పెద్దల సభ అంటే పెద్దలను సభకు పంపించాలని కానీ దద్దమ్మలను తద్దొజనాలను పంపించరాదని వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. సోమవారం ఆమె అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడారు. వ్యవస్థ లోను బ్రష్టు పట్టించడం లో చంద్రబాబు డ్రైవర్ అయితే అయనకు స్టీరింగ్ యనమల రామకృష్ణుడు. చంద్రబాబు నాయుడు శాసన మండలి లో ఎదురుగా ఛైర్మన్ ను కూర్చొని ప్రభావితం చేశాడు. శాసన మండలి ని రద్దు చేయమని జగన్మోహన్ రెడ్డి ని గట్టిగా అడుగుతానని అన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు తీర్మానం చేసి పంపించితే శాసన మండలి లో ఆలస్యం చేయటం సరికాదు. లొకేష్ తీరు చూస్తే బాగా బలిసిన కోడి చికెన్ షాపు ముందు తొడ కొట్టినట్లు వుంది. కోసి ఉప్పు కారం పూసి కూర వాడుకుంటారు. దమ్ముంటే శాసన మండలి రద్దు చేయమని లొకేష్ అనటం అలాగే వుంటుంది. ఇక యనమల రామకృష్ణుడు ప్రపంచ మేధావిని అని ఫీలవుతున్నాడని రోజా వ్యాఖ్యానించారు.