YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

హాజీపూర్ కేసు తీర్పు ఫిబ్రవరి 6 వాయిదా

హాజీపూర్ కేసు తీర్పు ఫిబ్రవరి 6 వాయిదా

హాజీపూర్ కేసు తీర్పు ఫిబ్రవరి 6 వాయిదా
నల్గోండ  జనవరి 27
సంచలం సృష్టించిన హాజీపూర్ హత్య కేసులో తుది తీర్పు ఫిబ్రవరి 6 కు వాయిదా పడింది. కేసులో ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. సోమవారం నాడు విన్న తుది తీర్పును వెలువరిస్తుందని అందరూ తీర్పు ప్రతులు వెలువడాల్సిన కారణంగా తీర్పును ఫిబ్రవరి 6కు వాయిదా వేస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. శ్రావణి, మనీషా, కల్పన ల హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణను ముగిసాయి.నిందితుడు శ్రీనివాస్ రెడ్డి బాలికలను కృరంగా అత్యాచారం చేసి బావిలో మృతదేహాలను పూడ్చి పెట్టినట్లు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. కోర్టులో 300మంది సాక్షులను విచారించారు. మరోవైపు, సమత అత్యాచారం కేసులో కూడా సోమవారమే తుది తీర్పు రావాల్సి వుండగా వాయిదా పడింది. న్యాయమూర్తి అనారోగ్యం కారణంగా సెలవులో ఉన్నారని, దీంతో తీర్పును ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. గత  నవంబర్ 24 తేదిన లింగాపూర్ మండలం ఎల్లపటార్ శివారులో సమత అత్యాచారం, హత్య జరిగింది. గ్రామాల్లో సంచరిస్తూ బెలూన్లు అమ్ముకుంటూ జీవనం సాగించే బాధితురాలు ఒంటరిగా ఉండటం గమనించి ముగ్గురు వ్యక్తులు అపహరించారు. చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి సామూహిక హత్యాచారం హత్య చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు రేపిన ఈ కేసు విచారణను తీవ్రంగా పరిగణించిన పోలీసులు 20 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేశారు. డిసెంబర్ 14న ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.

Related Posts