YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

 చినజీయర్ ట్రస్టుకు విజయవాడలో 40 ఎకరాలు..

 చినజీయర్ ట్రస్టుకు విజయవాడలో 40 ఎకరాలు..

 చినజీయర్ ట్రస్టుకు విజయవాడలో 40 ఎకరాలు..
విజయవాడ, జనవరి 27
సోమవారం ఉదయం సమావేశమైన ఏపీ కేబినెట్.. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. శాసన మండలిని రద్దు చేస్తూ తీర్మానం చేసింది. ప్రభుత్వం తీసుకొచ్చిన పలు బిల్లులకు అడ్డుతగులుతున్న శాసన మండలి రద్దు సరైందేనని మంత్రివర్గం అభిప్రాయపడింది. అందరి చూపు ఈ నిర్ణయంపై ఉండగా.. కేబినెట్ మరి కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంది. కడప ఆర్‌అండ్‌బీ ఆఫీసు ఆవరణలోని టీడీపీ కార్యాలయం తొలగింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా విజయవాడలో చినజీయర్‌ ట్రస్ట్‌కు 40 ఎకరాలు కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది.యాదగిరిగుట్ట జీయర్ ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమీని ఏర్పాటు చేయడం కోసం కేసీఆర్ సర్కారు చినజీయర్ స్వామికి గతంలో 2 ఎకరాల 30 గుంటల భూమిని కేటాయించిన సంగతి తెలిసిందే. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం గుండ్లపల్లిలోని సర్వే నెం.172లోని భూమిని ఎకరానికి రూ.6 లక్షల చొప్పున రూ.16.50 లక్షలకు యాదాద్రి టెంపుల్‌ ఏరియా డెవల్‌పమెంట్‌ అథారిటీ(వైటీడీఏ) విక్రయించింది. ఈ భూమిని చినజీయర్‌ స్వామి ప్రతినిధి పేరిట వైటీడీఏ 2019 సెప్టెంబర్ 5న రిజిస్ట్రేషన్‌ చేశారు. వైటీడీఏ పరిధిలో ఎకరా భూమి రూ.10 కోట్ల దాకా పలుకుతుండగా.. తెలంగాణ సర్కారు తక్కువ ధరకే భూమిని కేటాయించింది.

Related Posts