టిడిపి నుండి వైసీపీలోకి భారీగా వలసలు
వైసిపి కండువాలు కప్పి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి
ఎమ్మిగనూరు జనవరి 27
పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి స్వగృహంలో రైతు బాంధవుడు, శాసన సభ్యులు "ఎర్రకోట చెన్నకేశవరెడ్డి" గారు మరియు మన ప్రియతమ నాయకులు, రైతు బిడ్డ, నియోజకవర్గ సీనియర్ నాయకుడు "ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి" గారి సమక్షంలో ఎమ్మిగనూరు పట్టణజూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు రామక్రిష్ణా నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ కి చెందిన 300 మంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేరారు. వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ఆకర్శితులై టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్సీపీ లో చేరుతున్నారన్నారు. అన్ని వర్గాల మన్ననలు పొందుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు చూసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వారి అనుచరులు ఓర్వలేక పోతున్నారన్నారు. అందుకే ఇసుక కొరత ఉందంటూ, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్య వద్దంటూ గగ్గోలు పెడుతున్నారు. వీరికి ప్రజలే సమాధానం చెబుతారన్నారు. కాగా ప్రజారంజక పాలనను చూసి తాము వైఎస్సార్సీపీ లో చేరుతున్నామనారు. ఈకార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల శ్రీనివాస్ రెడ్డి, ధర్మాకారి నాగేశ్వరరావు, టౌన్ బ్యాంక్ డైరెక్టర్ సయ్యద్ చాంద్, పట్టణ యువజన ప్రెసిడెంట్ నజీర్ ఆహ్మద్, తదితరులు పాల్గొన్నారు.