విజయబాటలో ఇస్రో..మార్చిలోగా మరో మూడు రాకెట్ ప్రయోగం
న్యూ ఢిల్లీ జనవరి 27 :
ప్రతిష్టాత్మక మానవ సహిత అంతరిక్ష యాత్ర సన్నాహాల్లో భాగంగా మహిళా రోబో వ్యోమమిత్రను ఈ ఏడాదే అంతరిక్షంలోకి పంపిస్తామని అదే విధంగా మార్చిలోగా షార్ నుంచి మూడు రాకెట్ ప్రయోగాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు షార్ అసోసియేట్ డైరెక్టర్ ఎం.భద్రీనారాయణమూర్తి వెల్లడించారు.అయన మాట్లాడుతూ చంద్రుడిపైకి విదేశాలు మానవులను పంపిన రోజుల్లో మనం అంతరిక్ష ప్రయోగాలకు శ్రీకారం చుట్టామన్నారు. నేడు చంద్రుడిపైకి భారతీయులను పంపే స్థాయి ఎదిగామని చెప్పారు. విక్రమ్ సారాబాయి లాంటి మహామహులు వేసిన పునాదే ఇస్రోను ప్రపంచ దేశాలకు దీటుగా ఎదిగేలా చేసిందన్నారు. సతీష్ ధవన్ లాంటి మహోన్నత శాస్త్రవేత్తలు వైఫల్యాలను విజయానికి పునాదులుగా మలుస్తూ, ఇస్రోను విజయబాట పట్టించారన్నారు.