సీఏఏ మద్దతు ర్యాలీ
అనంతపురం జనవరి 27
అనంతపురంలో జనజాగరణ సమితి సభ్యులు పౌరసత్వానికి మద్దత్తుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ చట్టం ఎవ్వరికీ వ్యతిరేకం కాదని , బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టానికి బలపరుస్తూ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. దీనిపై కొన్ని రాజకీయ పార్టీలు అనవసర రాద్దాంతం చేస్తున్నారని సభ్యులు మండిపడ్డారు. దీనిపై ప్రజలకు పూర్తి స్ధాయిలో అవగాహన వచ్చేలా ఈ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.