వైఎస్సార్ ఆత్మక్షభిస్తుంది
కడప జనవరి 27 :
ఏపీ ప్రభుత్వం శాసనమండలిపై తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. 2004లో వైఎస్సార్ పునరుద్దరించిన మండలిని ఇప్పుడు జగన్ రద్దు చెయ్యడం వైఎస్సార్ ఆత్మక్షోభిస్తుందని కాంగ్రెస్ నేత తులసీ రెడ్డి అన్నారు. మూడు కారణాలను చూపించి మండలిని రద్దు చెయ్యడం సరికాదని చెప్పిన ఆయన, మండలి కారణంగా వచ్చే కారణాలేంటో చెప్సాలని అన్నారు.పేద రాష్ట్రానికి శాసనమండలి అవసరమా అని వ్యాఖ్యానిచ్చిన ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై స్పందించిన తులసి రెడ్డి హైకోర్టులో లాయర్ కు ఫీజు రూపంలో ఐదు కోట్లు ఇచ్చే ముఖ్యమంత్రి ఏపీకి అవసరమా అని ప్రశ్నించారు. శాసనమండలి దేనికి అడ్డుతగిలిందని ప్రశ్నించారు. పోలవరం, ప్రత్యేక ప్యాకేజీకి ఎక్కడా వ్యతిరేకించలేదని అన్నారు.