YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

విగ్రహ విద్వంసకుడి ఆరెస్టు

విగ్రహ విద్వంసకుడి ఆరెస్టు

విగ్రహ విద్వంసకుడి ఆరెస్టు
పిఠాపురం పట్టణంలో ఈ నెల 21వ తేదీన దేవాలయాల్లో పలు దేవతా విగ్రహాలను, ఫ్లెక్సీలను, ధ్వంసం చేసిన కేసులో నిందితుడిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేసారు.పిఠాపురం అగ్రహారానికి చెందిన అడపా మధుకర్ అలియాస్ మధు ను  దోషిగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు స్థానిక సి.ఐ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో కాకినాడ డి ఎస్ పి కరణం కుమార్ ఈ మేరకు వివరాలు మీడియాకు తెలియజేశారు. నిందితుడు మధుకర్ బీటెక్ చదువుతూ మధ్యలో మానివేసి చెడు వ్యసనాలకు లోనై మానసికంగా డిప్రెషన్ కి గురి అయ్యాడు.ఈక్రమంలో అతనితల్లిదండ్రులు పలుచోట్ల వైద్యం చేయించారు. అయినా అతని ఆరోగ్య పరిస్థితి కుదుటపడలేదు.ఈ నేపథ్యంలోనే ఘటనకు  పాల్పడ్డాడని డిఎస్పీ వివరించారు. ఇందులో ఎలాంటి దుశ్చర్య లేదని ప్రజలు సంయమనం పాటించాలని డీఎస్పీ స్పష్టం చేశారు .రిమాండ్ రిపోర్ట్ తో ఈరోజు జి ఎఫ్ జి ఎఫ్ ఎం సి కోర్టులో నిందితుడిని హాజరు పరిచినట్లు డిఎస్పీ కరణం కుమార్ తెలిపారు..
 

Related Posts