వచ్చే ఏడాది జగన్ చర్లపల్లి జైల్లో.
: రాష్ట్రంలో రౌడీ ప్రభుత్వం కొనసాగుతోందని టీడీపీ నేత దేవినేని ఉమ మండిపడ్డారు. కర్ణాటక రైతుల్ని పోలీసులు అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. అమరావతి రైతులకు సంఘీభావం తెలపడం నేరమా అని ప్రశ్నించారు. పోలీసులు రాజకీయాలకు దూరంగా ఉంటూ.. మీ ధర్మాన్ని పాటించాలని సూచించారు. సీఎం జగన్ వచ్చే జనవరికి జైల్లో ఉంటాడని జోస్యం చెప్పారు. వచ్చే ఏడాది జగన్ చర్లపల్లి జైల్లో గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాడని దేవినేని ఉమ ఎద్దేవాచేశారు.