రైతుల వాహాన ర్యాలీ
అమరావతి
రాజధాని అమరావతిలో రైతులు,మహిళ రైతులు మహా భారీ వాహాన ర్యాలీ నిర్వహించారు. తాడికొండ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. తుళ్లూరు మండలం లోని 29 గ్రామాల్లో ప్రజలు మూడు రాజధానులు వ్యతిరేకిస్తూ జై అమరావతి అనే నినాదాలతో వాహాన ర్యాలీ లో రైతు కూలీలు కుడా పెద్ద సంఖ్యలో పాల్గోన్నారు. దీక్ష శిబిరం నుండి తుళ్లూరు ప్రధాన విధుల్లో భైక్ ర్యాలీ వల్ల రోడ్లు మొత్తం ఆకుపచ్చ వాతావరణం చోటు చేసుకుంది. గ్రామాల్లోని ప్రజలు రోడ్డు ఏక్కడం తో రోడ్డులన్ని కిక్కిరిసిపోయాయి. బైక్ ర్యాలీ తుళ్లూరు నుండి బయలుదేరి రాయపూడి.ఉద్దండ్రాయునిపాలెం, మోదు లింగాయపాలెం వెలగపూడి మల్కాపురం మందడం కృష్ణాయపాలెం ,పెనుమాక ఎర్రబాలెం ,నవులూరు ,నిడమర్రు ,కురగల్లు నీరుకొండ, పెదపరిమి ,నెక్కల్లు ,అనంతవరం వడ్డమాను, హరిచంద్ర పురం, బోరుపాలెం దొండపాడు, గ్రామాల మీదుగా తుళ్లూరు చేరింది.