YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

నైజీరీయన్ గ్యాంగ్ ఆరెస్టు విశాఖపట్నం  

నైజీరీయన్ గ్యాంగ్ ఆరెస్టు విశాఖపట్నం  

నైజీరీయన్ గ్యాంగ్ ఆరెస్టు
విశాఖపట్నం  
విశాఖ కేంధ్రంగా సాగుతున్న ఆన్‌లైన్‌ మోసాన్ని సైబర్‌ క్రైం పోలీసులు అడ్డుకున్నారు.చారిటీ పేరుతో మోసాలకు పాల్పడుతున్న నైజీరియన్‌ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు నైజీరియన్లతో పాటు మేఘాలయకి చెందిన ఒక మహిళ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖకు చెందిన సంజయ్‌ సింగ్‌ అనే వ్యక్తి ఒక నైజీరియన్‌ సంస్థ చారిటీని నిర్వహిస్తున్నామని దాని కోసం సహాయాన్ని అందించాలని కోరుతూ మెయిల్ వచ్చింది.దీంతో సంజయ్ సంజయ్‌ 6.62 లక్షల రూపాయలను వివిధ అకౌంట్లకు పంపించాడు. తర్వాత వారి దగ్గర నుంచి ఎటువంటి సమాచారం రాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన సంజయ్‌ సింగ్‌ విశాఖ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. బాధితుని ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నైజిరీయన్‌ ముఠాను ఢిల్లీలో అరెస్ట్‌ చేశారు.వీరికి సహకరించిన మేఘాలయ రాష్ర్టానికి చెందిన మహిళను కూడా అదుపులోకి తీసుకున్నట్లు నగర సీపీ ఆర్కేమీనా తెలిపారు.నైజీరియన్‌ ముఠా నుంచి 55 వేల నగదు, రెండు లాప్‌టాప్‌లు, ఆరు మొబైల్‌ ఫోన్లు, ఏడు సిమ్‌కార్డులు, రెండు ఏటీఎం కార్డులతో పాటు వారి బ్యాంకు అకౌంట్లలో ఉన్న 1.46 లక్షల నగదును సీజ్‌ చేసనట్లు తెలిపారు.
 

Related Posts